శ్రీనివాస్ కుటుంబీకులకు 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి…
శ్రీనివాస్ భార్యకు గ్రూప్ 2 ఉద్యోగం కల్పించాలి..
దళిత ఉద్యోగులపై వేధింపులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధం….
జాతీయ మాల మహానాడు నాయకులు, తడికల లాలయ్య, ఏడెల్లి గణపతి
నేటిసూర్య ప్రతినిధి : అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ ను కులం పేరుతో వేధిస్తూ,అగ్రవర్ణాల అహంకారం ప్రదర్శిస్తూ నిత్యం వేధింపులకు గురిచేసి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన సీఐ ని, అలగే నలుగురు కానిస్టేబుళ్లను ఉద్యోగం నుండి తొలగించాలని, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర నాయకులు తడికల లాలయ్య, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఎడెల్లి గణపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జూన్ 30న ఆత్మహత్యకు పాల్పడ్డ ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందిన నేపథ్యంలో జాతీయ మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నాయకులు నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చర్ల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న దళితుడైన శ్రీరాముల శ్రీనివాస్ ను సీఐ జితేందర్ రెడ్డి, కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివ నాగరాజు వేధింపులకు గురి చేయడంతో గత నెల 30న ఆత్మహత్యకు పాల్పడ్డాడని,గత వారం రోజులుగా హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మరణించడం బాధాకరమని అన్నారు.అగ్రకుల అహంకారంతో రాష్ట్రవ్యాప్తంగా దళిత ఉద్యోగులపై వేధింపులు కొనసాగిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన సీఐ, కానిస్టేబుల్ లను ఉద్యోగం నుండి తొలగించాలని, శ్రీనివాస్ కుటుంబానికి 5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, ఆయన భార్యకు గ్రూప్ 2 ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.శ్రీనివాస్ మృతికి కారణమైన సీఐ జితేందర్ రెడ్డి, నలుగురు కానిస్టేబుళ్లను సర్వీసు నుండి తొలగించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల గౌరవ అధ్యక్షులు మోతుకూరి ప్రభాకర్, మండల అధ్యక్షులు రుంజా రాజా, నాయకులు తోటమల్ల కృష్ణారావు,చినిగిరి సుధాకర్, కర్రి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.