దుమ్మగూడెం, నేటి సూర్య
దుమ్ముగూడెం మండలం బి కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలో. ఇండియన్. రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో. ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి గ్రామస్థలు , చుట్టుపక్కల గ్రామాల వారు అధిక సంఖ్యలో పాల్గొని ఉచితంగా మందులు తీసుకోవడం జరిగింది. అత్యధికంగా జ్వరము. కేసులు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ శిబిరానికి ముఖ్యఅతిథిగా. మందపాటి సుధాకర్ రెడ్డి గారు. పాల్గొని మాట్లాడుతూ. సీజనల్ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని జ్వరము డెంగ్యూ మలేరియా రాకుండా ఉండటానికి గ్రామస్తులకు తగు సూచనలు ఇచ్చారు. దుమ్ముగూడెం మండలంలో స్వచ్ఛంద సంస్థల ఇంకా ముందుకు వచ్చి పేద ప్రజలకు వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు ఎస్ఎల్ కాంతారావు. జి రాజారెడ్డి. డాక్టర్ భాను ప్రసాద్. సిపిఐ నాయకులు నోముల రామిరెడ్డి. రాజారెడ్డి. సర్పంచ్ వెంకటేశ్వర్లు. ఉప సర్పంచ్. లక్ష్మణరావు. గ్రామస్తులు పాల్గొన్నారు.