చర్ల, నేటిసూర్య :సెప్టెంబర్ 11నుండి జరుగుతున్న అంగన్వాడి ,మినీ అంగన్వాడీ అండ్ హెల్పర్స్ నిరవదిక సమ్మెకు నాయకత్వం వహిస్తున్న సంఘాలతో చర్చలు జరపాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి అన్నారు సమ్మె శిబిరంలో శ్యామల వెంకట్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బ్రహ్మచారి మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రడ్యుటీ చెల్లించాలని మినీ టీచర్స్ ఇటువంటి షరతులు లేకుండా మెయిన్ టీచర్స్ గా గుర్తించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 10 లక్షలు హెల్పర్ ఐదు లక్షలు ఇవ్వాలని వేతనంలో సెకండ్ పెన్షన్ అందించాలని పి ఎఫ్ ఈ ఏస్ ఐ ఉద్యోగ భద్ర కల్పించాలని ప్రమాద బీమా సౌకర్యం ఐదు లక్షలు చెల్లించాలని ఐసిడిఎస్ మంత్రి సమ్మెపై అధికారులు అబద్ధపు అంగన్వాడీ ప్రసారాలు మానుకోవాలి అని రాష్ట్ర వ్యాప్తంగా నిరవదిక సమ్మె పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని సమ్మెకు నాయకత్వం వహిస్తున్న సిఐటియు అనుబంధ తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరియు ఏఐటియుసీ అనుబంధ తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకత్వంతో ప్రభుత్వ చర్చలు జరపాలని సమ్మెలో పెట్టిన అన్ని రకాల డిమాండ్స్ పరిష్కారం చేయాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి డిమాండ్ చేశారు ఏ ప్రభుత్వమైనా సమ్మెలో ఉన్న వారితో చర్చలు జరుగుతుంది కానీ సమ్మె చేయని నాయకుల తోటి చర్చలు ఎలా జరుపుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు డిమాండ్ల పైన మంత్రి అబద్ధలను అసత్యాలను మానుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ పాయం రాధాకుమారి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్CITU నాయకులుతళ్ళుారికృష్ణ సత్రంపల్లి సాంబ శివరావు కమల మనోహరి పాలెం నాగమణి సావిత్రి అనసూర్య ఇర్ఫా సత్యవతి కృష్ణవేణి అనురాధ రాధ రాణి శమంతకమణి స్వరూప భానుమతి నాగమణి చిలకమ్మా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
సమ్మెకు నాయకత్వం వహిస్తున్న.. చేస్తున్న సంఘాలతోని ప్రభుత్వం చర్చ జరపాలి.
RELATED ARTICLES