చర్ల, నేటిసూర్య:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు , ఎఐసిసి సభ్యులు శ్రీ పొదెం వీరయ్య భద్రాచలం నియోజకవర్గం చర్ల మండలం తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మొత్తం 54 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,00,116 రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. మొత్తం చెక్ల విలువ 54,06, 264/- రూపాయలు ఈ సందర్భంగా శాసనసభ్యులు త్వరితగతిన ఫైలు ప్రాసెసింగ్ చేయాలని వీలైనంత ఎక్కువమంది లబ్ధిదారులను పథకం ద్వారా లబ్ధి చేకూరే విధంగా చూడాలని అమాయక గిరిజనులను సర్టిఫికెట్ల విషయంలో కానీ పథకాల విషయంలో గాని ఇబ్బందులకు గురి చేయవద్దని ఆదేశించడం జరిగింది.