*అసైన్డ్ మెంట్ భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వాలి*
*సీపీఎం నియోజకవర్గం కో కన్వీనర్ కారం పుల్లయ్య డిమాండ్*
దుమ్ము గూడెం, నేటిసూర్య : అసైన్మెంట్ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు వెంటనే ఇవ్వాలని సీపీఎం నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని తాహశీల్దార్ నందు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భీమవరం, మారాయిగూడెం గ్రామ రైతులతో ధర్నా నిర్వహించి తాహశీల్దార్ చంద్రశేఖర్ కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… గత 50 సంత్సరాల తాతల కాలం నుండి సాగు చేస్తున్న భూములకు అసైన్మెంట్ పట్టాదారు పాస్ పుస్తకాలు గత ప్రభుత్వం ఇచ్చిందని తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తకాలు మారయిగూడెం, భీమవరం గ్రామాల రైతులకు రాలేదని రైతుల ఆందోళన చెందుతున్నారని అన్నారు. రైతులకు తెలంగాణ కొత్త పట్టాదారు పుస్తకాలు ఇచ్చి రైతు బీమా, రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎలమంచి వంశీ, కొండపల్లి శ్రీధర్, మర్మం చంద్రయ్య,మండల నాయకులు నిమ్మల మధు, సరియం ప్రసాద్,సొసైటీ డైరెక్టర్ ఉబ్బా భద్యయ్య, అపక సత్యం సోది వీరస్వామి మచ్చ సుబ్బయ్య, సోయం జోగారావు, సోయం భూపతి,యర్రయ్య, కారం రమణ, సోందే మహాలక్ష్మి, కల్లూరి బుచ్చమ్మ,సోడి వెంకటేశ్వర్లు,అపక కృష్ణ మూర్తి,తదితరులు పాల్గొన్నారు